కమిషనర్ పీ. సరస్వతి ఆధ్వర్యంలో సమావేశం..
బడంగ్ పేట్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహణ..
కమీషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశముల మేరకు 100 రోజుల ప్రణాళిక లో భాగంగా గురువారం రోజు బడంగ్ పేట్ నగర పాలక సంస్థ కార్యలయంలో కమిషనర్ పి. సరస్వతి అధ్వర్యంలో 18 రోజు కార్యకలాపాలలో భాగంగా తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి ప్రతి ఇంటి వెళ్ళి స్వచ్చ ఆటోకి ఇవ్వాలని ప్రజలకు అవగాహన కల్పించాలని వార్డు ఆఫీసర్లకు, బిల్ కలెక్టర్లకు, జవాన్లకు చెప్పడం జరిగినది.. మైక్ ప్రకటన ద్వారా ప్లాస్టిక్ గురించి అవగాహన కల్పించడం, పాఠశాలలో ప్లాస్టిక్ గురించి బడి పిల్లలకు అవగాహన కల్పించడం, వీధి కూరగాయల మార్కెట్ ఇరు వైపుల రోడ్డుకు గాను ఇరుకుగా ఉన్నచో వారికి అనుకులమైన స్థలం కేటాయించాలి.. వీధి విక్రేతల సాధారణ ఆసక్తిగల సమూహల, కొత్త స్వయం సహాయక సంఘాల ఏర్పాటు గురించి వివరించడం జరిగినది. భువన్ సర్వేలో భాగంగా ఇంటి ఇంటికి వెళ్లి కోలతలను తీసుకోని పన్ను విధించాలి. ఇంటి పన్ను వసూలు చేయడంలో అలసత్వం వహించరాదు.. ప్రతి నెల పన్ను 5 శాతం వసూలు జరగాలి.. ట్రేడ్ లైసెన్స్ లు లేకుండా వాణిజ్య, మిశ్రమ ఆస్తుల గుర్తింపు.. నీటి మట్టాలలో క్లోరినేషన్ పరీక్ష,, యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రచారలు.. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయినవారికి గ్రౌండింగ్ చేయించాలి.. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రజల సమస్యలను పరిష్కరించాలని బడంగ్ పేట్ కమీషనర్ ఆదేశాలు ఇవ్వడం జరిగినది.
ఈ కార్యక్రమంలో ఏ.ఎం.సి. శ్యామ్ సుందర్, డీఈ వెంకన్న, ఎస్.ఐ. వంకాయల యాదగిరి, ఆర్.ఓ. వేణుగోపాల్ రెడ్డి, ఎం.ఈ.పీ.ఎం.ఏ. శంకర్, ఈఈ మౌనిక, వార్డు ఆఫీసర్లు, సానిటేషన్ సిబ్బంది, ఆర్.పీ.లు, ఎస్.హెచ్.జీ. మహిళలు పాల్గొన్నారు..