జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ జరగనున్న సందర్భంగా..మంగళవారం రోజు ఉదయం కోటి విక్టరీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ మ్యాచ్ లో హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి, ఇతర బీజేపీ కార్పొరేటర్లు..పాల్గొన్నారు.. అదే విధంగా
మంగళవారం రోజు చైతన్యపురి డివిజన్ లోని మునిసిపల్ కాలనీలో వాటర్ లైన్ విషయంలో, కొత్త రోడ్స్ అవసరం దృష్ట్యా.. కాలనీ వాసులు పిలిచిన వెంటనే అక్కడకు వెళ్లి అధికారులను పిలిపించి వెంటనే పనులు చేయాలని, సమస్యలను పరిష్కరించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమం లో హెచ్.ఎం.డబ్ల్యు.ఎస్.ఎస్. డీజీఎం రవి వర్మ, ఇన్స్పెక్టర్ సురేందర్, జవాన్ శ్రీకాంత్, కాలనీ వాసులు శ్రీహరి ఇతర పెద్దలు, బీజేపీ డివిజన్ నాయకులు రుద్రారపు శంకర్, నరేందర్ రెడ్డి, అర్జున్ సింగ్ మొదలగు వారు పాల్గొన్నారు..
