అప్పుడే పార్టీ బలంగా ఉంటుంది..
వెల్లడించిన కప్పాటి పాండురంగా రెడ్డి, మదన్ పాల్ రెడ్డి..
ఏఐసిసి, పిసిసి అదేశం మేరకు మహేశ్వరంనియోజకవర్గం ఇంచార్జ్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి సూచన మేరకు పోంరడ్ల గ్రామ కమిటీని కస్టర్ కన్వీనర్ కంబాలపల్లి మదన్ పాల్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ కప్పాటి పాండురంగా రెడ్డిని కస్టర్ సభ్యులు ప్రకటించిన వారు మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలతో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 17 మాసాలలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ సేవలు 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, రేషన్ కార్డుల మంజూరు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే వంట గ్యాస్ పంపిణీ, రైతుల రుణమాఫీ, రైతు భరోసా తదితర పథకాలను అమలు చేస్తున్నది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాల భర్తీ, బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అమలు చేయడంతో పాటు పలు అభివృద్ధి పనులు చేస్తున్నా.. జరుగుతున్నా. ప్రతిపక్ష పార్టీలు అసత్య ఆరోపణలు చేస్తున్నారు.. బిఅర్ఎస్ ప్రభుత్వం గత పది సంవత్సరాలలో చేసిన దోపిడీ, తెలంగాణ రాష్ట్రానికి చేసిన తీరని అన్యాయాన్ని, ఆర్ధిక సంక్షోభాన్ని వివరించడంలో, కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తున్న సంక్షేమ అభివృద్ధి పట్ల ప్రజలకు విడమర్చి చెప్పడంలో విపలంకాకుండా సంస్థా గతంగా నాయకులకు అవగాహన కలిపిస్తూ.. స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ అభ్యర్థులను గెలిపించేలా కార్యకర్తలను సంసిద్ధం చేస్తున్నామని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో కస్టర్ సభ్యులు, బూసమోని యాదయ్య, బండ వేణుగోపాల్, బొక్క సంజీవరెడ్డి, పాండు, ప్రభాకర్, పస్పలత తదితరులు పాల్గొన్నారు.