కుటుంబసమేతంగా వచ్చి ఆస్వాదించదగ్గ హోటల్ అని కితాబు..
మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సుల్తాన్ పూర్ ఎయిర్ పోర్ట్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన అరేబియన్ స్పైస్ రెస్టారెంట్ ను ప్రారంభించారు మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగురింత పారిజాత నరసింహ రెడ్డి.. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఆహ్లాదకరమైన వాతావరణంలో కుటుంబ సమేతంగా విచ్చేసి విందు చేసేందుకు, బోజన ప్రియుల కోసం ఎయిర్ పోర్ట్ మార్గంలో రుచికరమైన డిషెస్ ఏర్పాటు చేయడం విశేషమని అన్నారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొర్రా జగన్ రెడ్డి, జింకల రాధిక శ్రవణ్, రెస్టారెంట్ యాజమాన్యం మొయిజుద్దీన్, సముయుద్దీన్, వయసుద్దీన్, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.


