Monday, July 27, 2026
Google search engine
Homeతెలంగాణహాస్టల్ యజమానుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి

హాస్టల్ యజమానుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి

ఎల్బీనగర్:

రాష్ట్రంలోని ప్రైవేట్ హాస్టల్ యజమానులు ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. బియ్యం, వంటనూనె, కూరగాయలు, ఇతర నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయి. గ్యాస్ సిలిండర్ ధరలు, విద్యుత్ బిల్లులు, నీటి సమస్య, భవనాల అద్దెలు వంటి నిర్వహణ ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
మరో వైపు విద్యార్థుల అడ్మిషన్లు ఆశించిన స్థాయిలో లేకపోవడం, సంబంధిత నోటిఫికేషన్లు ఆలస్యం కావడం వల్ల అనేక హాస్టళ్లలో గదులు ఖాళీగా ఉన్నాయి. హాస్టల్ నిర్వహిస్తే నష్టాలు, మూసివేస్తే పెట్టుబడులు కోల్పోతామనే పరిస్థితిలో యజమానులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.అదే సమయంలో పెరిగిన నిర్వహణ ఖర్చుల కారణంగా హాస్టల్ ఫీజులు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పెరిగిన ఫీజులు భరించలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి యజమానులు, విద్యార్థులు, తల్లిదండ్రులు—ముగ్గురినీ తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను అత్యవసరంగా పరిశీలించి, హాస్టల్ రంగానికి అవసరమైన మద్దతు అందించాలి. విద్యార్థుల అడ్మిషన్లకు సంబంధించిన నోటిఫికేషన్లను సకాలంలో విడుదల చేయడం, హాస్టల్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించడం, సంబంధిత శాఖలతో సమావేశం నిర్వహించి తగిన చర్యలు చేపట్టడం అవసరం. విద్యార్థుల భవిష్యత్తును నిర్మించే హాస్టళ్లను కాపాడటం ప్రభుత్వం, సమాజం అందరి బాధ్యత. ప్రభుత్వం వెంటనే స్పందించి హాస్టల్ యజమానులకు, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని హాస్టల్ నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments