ఎల్బీనగర్:
ఆర్కేపురం డివిజన్ చిత్రా లేఔట్ కాలనీలో పక్కనే ఆనుకొని ఉన్న మార్కెట్ నుండి గత నెల రోజుల నుండి వస్తున్న విపరీతమైన దుర్వాసనతో కాలనీవాసులు శ్యాస తీసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. వ్యవసాయ మార్కెట్ లో ఉన్న కోల్డ్ స్టోరేజ్ కి వచ్చే వాహనాలు రాత్రి అంతా ఇంజన్లు ఆన్ చేసి పెట్టడం వలన వచ్చే శబ్దాలతో నిద్ర పట్టడం లేదని ఈ సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలని జాయింట్ డైరెక్టర్ మార్కెట్ సెక్రటరీకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో చిత్రా లేఔట్ కాలనీ అధ్యక్షుడు పెండ్యాల నగేష్, కాలనీ వాసులు సుధాకర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, విజయ్ భాస్కర్ రెడ్డి, నర్సింహా గౌడ్, బీవి రావు, శ్రీకాంత్ రెడ్డి, శరత్, ఉదయ్ శంకర్ రెడ్డి, తిరుపతి రావు, సత్తిరెడ్డి, కిషోర్ పాల్గొన్నారు.


