కుంటను సందర్శించిన హైడ్రా కమిషనర్ రంగనాధ్..
కుంట పునరుద్దరణకు చర్యలపై అధికారులతో సమీక్ష..
పరిసర ప్రాంతాల నుంచి చెరువుకు నీరు చేరే మార్గాల పరిశీలన..
ఔటరరింగురోడ్డుకు చేరువలోని, నానక్రామ్గూడ చౌరస్తా, ఖాజాగూడలోని, తౌటోని కుంటను బుధవారం నాడు సందర్శించారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్.. తౌటోని కుంట చెరువు పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై రెవెన్యూ, ఇరిగేషన్, జీహెచ్ ఎంసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు.. పరిసర ప్రాంతాల నుంచి చెరువుకు నీరు చేరే మార్గాలను పరిశీలించారు..

మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్ధూ యూనివర్సిటీ ఖాళీస్థలంలో వర్షపు నీరు నిలవడంతో ఆ దగ్గరలోని అపార్టుమెంట్ల సెల్లార్లలోకి నీరు వచ్చి చేరుతోందని స్థానికులు ఆయనకు ఫిర్యాదు చేశారు.. యూనివర్సిటీ ఖాళీ స్థలంలోంచి వరద నేరుగా తౌటోని కుంటకు చేరితే ఈ ఇబ్బంది తొలుగుతుందని స్థానికులు ఆయన దృష్టికి తెచ్చారు.. యూనివర్సిటీ ఖాళీ స్థలంలోని వరద నీరు సులభంగా కాలువ ద్వారా తౌటోని కుంటకు చేరేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు..తౌటోని కుంట నిండితే ఆ నీరు నేరుగా భగీరధమ్మ చెరువుకు చేరేలా కాలువ ఏర్పాటు చేయాలంటూ అధికారులకు హైడ్రా కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.. నివాసాల మధ్య ఉన్న చెరువుల పునరుద్ధరణపై హైడ్రా దృష్టి పెట్టిందని.. ముందుగా వాటి ఎఫ్టీఎల్ నిర్ధారించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్..