Wednesday, July 30, 2025
Google search engine
Homeనేషనల్జమిలి ఎలక్షన్ దిశగా అడుగులు వేస్తున్నాము:ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

జమిలి ఎలక్షన్ దిశగా అడుగులు వేస్తున్నాము:ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

గుజరాత్ లోని కేవడియాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిసందర్బంగా నిర్వహించిన సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ముందుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళులర్పించారు. తర్వాత సభలో మోడీ ప్రసంగిస్తూ… వన్ నేషన్-వన్ ట్యాక్స్, వన్ నేషన్-వన్ పవర్ గ్రిడ్ , వన్ నేషన్ -వన్ రేషన్ కార్డు విధానం తెచ్చాం..
వన్ నేషన్- వన్ ఎలక్షన్ కూడా తీసుకువస్తామని ఆయన బలంగా చెప్పారు. ఎన్నికలతో దేశ ప్రగతి కుంటుపడుతోందన్నారు. గత ప్రభుత్వాలు తమ విధానాలతో దేశాన్ని వెనకపడేలా చేశాయని విమర్శించారు. దేశ ఐక్యతను దెబ్బతీసేందుకు బయటి, లోపలి శక్తులు బలంగా ప్రయత్నిస్తున్నాయని ఆయన విమర్శించారు.
ఈ కుట్రలను సాగనివ్వబోమని ఆయన అన్నారు. జమిలి ఎలక్షన్ దిశగా అడుగులు వేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. జమిలి ఎలక్షన్ సివిల్ కోడ్ తో దేశంలో వివక్షకు తెరపడుతోందన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments